Viveka murder case: వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన భాస్కర్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-06-08T15:26:00+05:30 IST

నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్.వివేకా హత్య కేసు విచారణ జరిగింది. కేసు విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. చంచల్‌గూడ జైల్లో

Viveka murder case: వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన భాస్కర్‌రెడ్డి
Viveka murder case

హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్.వివేకా హత్య కేసు విచారణ జరిగింది. కేసు విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరినీ పోలీసులు సీబీఐ కోర్టుకు తీసుకొచ్చారు. తదుపరి విచారణ ఈనెల 16కు న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే ఈ హత్య కేసులో కీలకంగా మారిన వివేకా రాసిన లేఖను నిన్ హైడ్రిన్ పరీక్ష చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. హత్యకు ముందు వివేకా రాసిన లేఖగా పరిగణించడంతో వేలిముద్రలను గుర్తించడానికి నిన్ హైడ్రిన్ పరీక్ష చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీని ద్వారా అసలు ఆ లేఖ ఎవరు రాశారో తేలిపోనుందని సీబీఐ భావిస్తుంది.

Updated Date - 2023-06-08T15:26:00+05:30 IST