Nakka Anandababu: దళిత నేతలపై వైసీపీ కక్ష సాధింపు..
ABN , First Publish Date - 2023-06-05T15:25:57+05:30 IST
గుంటూరు జిల్లా: దళిత నేతలపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.
గుంటూరు జిల్లా: దళిత నేతలపై వైసీపీ (YCP) కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Nakka Anandababu) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా, కొండేపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి (Dola Veeranjaneya Swamy)పై ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. పదే పదే స్వామినే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ (Assembly) సాక్షిగా ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామిపై రెండు సార్లు దాడి జరిగిందని, సీఎం జగన్ రెడ్డి (CM Jagan) డైరెక్షన్లోనే స్వామిపై దాడులు చేస్తున్నారని నక్కా ఆనందబాబు ఆరోపించారు. దళితులు ప్రజాప్రతినిధులుగా ఎదగడం ముఖ్యమంత్రికి నచ్చదని, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అవినీతి చేశారని అనడం హస్యాస్పదంగా ఉందన్నారు. వీరాంజనేయ స్వామిపై దాడి, పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నక్కా ఆనందబాబు అన్నారు.