Purandeswari: జమిలి ఎలక్షన్స్ వస్తే ఎవరైనా ఎదుర్కోవాల్సిందే..

ABN , First Publish Date - 2023-09-01T20:27:12+05:30 IST

జమిలి ఎలక్షన్స్(Jamili elections)వస్తే ఎవరైనా ఎదుర్కోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి (Purandeswari ) అన్నారు.

Purandeswari:  జమిలి ఎలక్షన్స్ వస్తే ఎవరైనా ఎదుర్కోవాల్సిందే..

అమరావతి: జమిలి ఎలక్షన్స్(Jamili elections)వస్తే ఎవరైనా ఎదుర్కోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి (Purandeswari) అన్నారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు రోజులు పాటు పార్లమెంట్ సమావేశాలు జరుగబోతున్నాయి. ఏ అంశం మీద పార్లమెంట్‌లో చర్చింస్తారో తెలియదు. పార్లమెంట్‌లో ప్రధానంగా జమిలి ఎలక్షన్స్ కోసమే అన్న ప్రచారం జరుగుతోంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై విధివిధానాలను స్వాగతించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం హర్షణీయం.వివిధ స్థాయిలల్లో తరచుగా జరిగే ఎన్నికల కంటే ప్రభుత్వం పాలనపై దృష్టి సారించడం ఎంతో అవసరం. ఎన్నికల ఖర్చును తగ్గించడంలో, పరిపాలనలో భారాన్ని జమిలి ఎన్నికలతో తగ్గించవచ్చు ఈ చొరవ మనం ఒక దేశం అనే నమ్మకానికి మద్దతు ఇస్తుందని పురంధరేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-01T20:35:06+05:30 IST