Guntur Dist.: కలెక్టరేట్‌లో గృహనిర్మాణ పథకంపై జోగి రమేష్ సమీక్ష

ABN , First Publish Date - 2023-04-19T14:04:37+05:30 IST

గుంటూరు జిల్లా: కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) బుధవారం సమీక్ష జరిపారు.

Guntur Dist.: కలెక్టరేట్‌లో గృహనిర్మాణ పథకంపై జోగి రమేష్ సమీక్ష

గుంటూరు జిల్లా: కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో సమస్యలపై సమీక్షించామన్నారు. వైసీపీ (YCP) అధికారంలోకి రాగానే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. వారికి శాశ్వితంగా ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

ఇంత మంచి చేస్తుంటే శిఖండుల్ల చంద్రబాబు (Chandrababu) అడ్డుపడుతున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఇళ్ల స్థలాల పంపిణీపై కోర్టులకు వెళ్తున్నారని, సెల్ఫీలు దిగి ట్వీట్ (Tweet) చేయటం.. వారు కట్టించినవిగా చెప్పుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ గడప వద్దకు వెళ్లైనా 14 ఏళ్లలో ఎం చేశారో చంద్రబాబు చెప్పగలరా?.. 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను చంద్రబాబు నిలబెట్టగలరా? అని ప్రశ్నించారు. మే నెలాఖరుకు 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-19T14:04:37+05:30 IST