Janasena Leader: అంబటికి చెప్పుల దండ వేసే రోజులు దగ్గర పడ్డాయి

ABN , First Publish Date - 2023-05-15T12:59:34+05:30 IST

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించని వైసీపీ నాయకులు, మంత్రులు.. పవన్ కళ్యాణ్‌పై విరుచుకు పడుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Janasena Leader: అంబటికి చెప్పుల దండ వేసే రోజులు దగ్గర పడ్డాయి

గుంటూరు: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించని వైసీపీ నాయకులు, మంత్రులు.. పవన్ కళ్యాణ్‌పై విరుచుకు పడుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు (Janasena Leader Gade Venkateswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి (Minister Ambati) రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. సాగర్ నీటి కోసం రైతులు ఆందోళన చేసినప్పుడు ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్ట్ గేటు విరగడంపై ఎందుకు లేఖ రాయలేదని అడిగారు. కేంద్రానికి పోలవరం ప్రాజెక్టుపై ఎప్పుడైనా లేఖ రాశారా అని నిలదీశారు. అంబటి కొట్టేసిన ఇరవై ఎకరాల్లో ఆశ్రమం పెట్టుకొని ప్రవచనాలు చెప్పుకొనే టైం దగ్గర పడిందన్నారు. బరితెగించి మాట్లాడే రాంబాబుకి చెప్పుల దండ వేసే రోజుల దగ్గర పడ్డాయని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

Updated Date - 2023-05-15T13:00:25+05:30 IST