Prathipati Pullarao: మంత్రి విడదల రజినిపై మండిపడ్డ ప్రత్తిపాటి పుల్లారావు

ABN , First Publish Date - 2023-07-24T15:13:53+05:30 IST

తాగునీటి పైపులైన్‌ పనులు 90 శాతం పూర్తయినా అందుబాటులోకి తేవడం లేదు. పైపులైన్‌ కూడా పూర్తి చేయలేకపోయిన రజిని మంత్రిగా సిగ్గుపడాలి. పనులు పూర్తి చేయాలన్న ఇంకితజ్ఞానం లేని రజిని. మంత్రికి తెలిసింది దోచుకోవడం.. దాచుకోవడమే.

Prathipati Pullarao: మంత్రి విడదల రజినిపై మండిపడ్డ ప్రత్తిపాటి పుల్లారావు

పల్నాడు: పసుమర్రులో తాగునీటి పైపులైన్‌ పనులపై మాజీ మంత్రి ప్రత్తిపాటి (Prathipati Pullarao) సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారో చెప్పాలంటూ మంత్రి విడదల రజినికి (Vidadala Rajini) సవాల్ విసిరారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. ‘‘తాగునీటి పైపులైన్‌ పనులు 90 శాతం పూర్తయినా అందుబాటులోకి తేవడం లేదు. పైపులైన్‌ కూడా పూర్తి చేయలేకపోయిన రజిని మంత్రిగా సిగ్గుపడాలి. పనులు పూర్తి చేయాలన్న ఇంకితజ్ఞానం లేని రజిని. మంత్రికి తెలిసింది దోచుకోవడం.. దాచుకోవడమే. చిలకలూరిపేటలో మద్యం షాపులన్ని మంత్రి ఆధీనంలోనే ఉన్నాయి. 6 వేల ఎకరాలకు నీరిచ్చే 2 ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేశారు. మంత్రి రజిని అసమర్థతతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. చిలకలూరిపేటకు ఈ దుస్థితి ఎందుకు తెచ్చారో రజిని చెప్పాలి.’’ అని పుల్లారావు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-24T15:13:53+05:30 IST