Achchennaidu: తాడికొండలో వైసీపీ రౌడీమూకల రాళ్లదాడి దుర్మార్గం

ABN , First Publish Date - 2023-09-21T21:18:21+05:30 IST

తాడికొండలో టీడీపీ దీక్ష శిబిరంపై వైసీపీ రౌడీమూకల రాళ్లదాడి దుర్మార్గమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు.

Achchennaidu: తాడికొండలో వైసీపీ రౌడీమూకల రాళ్లదాడి దుర్మార్గం

అమరావతి: తాడికొండలో టీడీపీ దీక్ష శిబిరంపై వైసీపీ రౌడీమూకల రాళ్లదాడి దుర్మార్గమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వినాయక నిమజ్జనానికి వెళ్తూ దీక్ష శిబిరంపై దాడి చేయడానికి సిగ్గుగా లేదా?. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి దేవుడి నిమజ్జనం చేశారు. ప్రజలు త్వరలోనే వైసీపీని బంగాళాఖాతంలో నిమజ్జనం చేస్తారు. వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు(YCP MLA Namburi Shankarrao) అనుచరులే తెలుగుదేశం దీక్ష శిబిరంపై దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతలపై దాడికి శంకర్రావు బాధ్యత వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-21T21:18:21+05:30 IST