Somireddy: పవన్ వ్యాఖ్యలతో జగన్‌కు నిద్ర పట్టట్లేదు

ABN , First Publish Date - 2023-05-27T14:14:59+05:30 IST

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్‌కల్యాణ్ కామెంట్లతో జగన్‌కు నిద్ర పట్టడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు

Somireddy: పవన్ వ్యాఖ్యలతో జగన్‌కు నిద్ర పట్టట్లేదు
Somireddy Chandramohan Reddy

రాజమండ్రి: వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్‌కల్యాణ్ కామెంట్లతో జగన్‌కు నిద్ర పట్టడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) ఎద్దేవా చేశారు. మహానాడులో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పవన్‌కల్యాణ్ మంచి మనసుతో చెప్పారని వ్యాఖ్యానించారు. ఏపీని హింసావాది చేతుల్లో నుంచి కాపాడుకోవాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసు సీఎం జగన్ (CM JAGAN) చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డిని (Avinash Reddy) అరెస్ట్ చేయడానికి సీబీఐకు ఏం అడ్డం వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. సీబీఐ (CBI) లాంటి అతి పెద్ద నేర పరిశోధన సంస్థ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతోందని వెల్లడించారు. ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ జెండాలు కడతారా..? వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేపటి సభలో చంద్రబాబు (Chandrababu) ఎన్నికల సందేశం ఇవ్వబోతున్నారని సోమిరెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-05-27T14:21:15+05:30 IST