Share News

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముమ్మిడివరం ఎమ్మెల్యే బంధువులు మృతి

ABN , Publish Date - Dec 27 , 2023 | 12:31 PM

Andhrapradesh: అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ సొంత బంధువులుగా గుర్తించారు.

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముమ్మిడివరం ఎమ్మెల్యే బంధువులు మృతి

కోనసీమ: అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ సొంత బంధువులుగా గుర్తించారు. మృతులు ఎమ్మెల్యే సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబసభ్యులు. నాగేశ్వరరావు చిన్న కుమార్తె నవీన గంగ, అల్లుడు లోకేష్‌తో పాటు ఇద్దరు పిల్లలు టెక్సాస్‌లో ఉంటున్నారు. 6 నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీనతో కలిసి తండ్రి నాగేశ్వరరావు, తల్లి సీతామహాలక్ష్మి టెక్సాస్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో నాగేశ్వరరావు, సీతామహాలక్ష్మి, కుమార్తె నవీనతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. నాగేశ్వరరావు అల్లుడు లోకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కుటుంబసభ్యుల మృతితో అమలాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Dec 27 , 2023 | 12:31 PM