Ramanaidu : పోలవరం ప్రాజెక్టుకు శనిగ్రహంలా జగన్

ABN , First Publish Date - 2023-08-23T17:07:19+05:30 IST

పోలవరం ప్రాజెక్టు(Polavaram project)కు శనిగ్రహంలా సీఎం జగన్(CM JAGAN) మారాడని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Ramanaidu) అన్నారు.

Ramanaidu :  పోలవరం ప్రాజెక్టుకు శనిగ్రహంలా జగన్

ఏలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టు(Polavaram project)కు శనిగ్రహంలా సీఎం జగన్(CM JAGAN) మారాడని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Ramanaidu) అన్నారు. బుధవారం నాడు ఏలూరులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్ట్ పోలవరం అని ఈ ప్రాజెక్టుని వైసీపీ ప్రభుత్వం(YCP Govt) అధ్వానంగా మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు చంద్రబాబు(Chandrababu) 2020లో కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చెయాలనే లక్ష్యంతో పనిచేసి 72%పూర్తి చేశారన్నారు. జగన్ ప్రభుత్వంలో కనీసం నాలుగు శాతం కూడా పనులు ముందుకు సాగలేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేచర్‌లోనే చంపడం,విధ్వంసం అనేది ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజావేదిక, పోలవరాన్ని,వ్యవసాయాన్ని, అమరావతి రాజధానిని, ఉద్యోగస్తులను, రైతులను, మహిళల హక్కులను విధ్వంసాలు సృష్టించి చంపేశారని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.

Updated Date - 2023-08-23T17:07:19+05:30 IST