AP NEWS: రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీ మృతి.. అధికారులు ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-09-21T21:20:29+05:30 IST

రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail )లో రిమాండ్‌లో ఉన్న ఖైదీ గంజేటి వీరవెంకట సత్యనారాయణ ఈ రోజు మృతిచెందాడు.

 AP NEWS: రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీ మృతి.. అధికారులు ఏమన్నారంటే..?

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail ) లో రిమాండ్‌లో ఉన్న ఖైదీ గంజేటి వీరవెంకట సత్యనారాయణ ఈ రోజు మృతిచెందాడు. ఈ మేరకు జైళ్ల ఉపశాఖాధికారి రిమాండ్ ఖైదీ మృతిపై ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.సత్యనారాయణ రాజమండ్రి సెంట్రల్ జైలులో మరణించలేదు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో డెంగ్యూ జ్వరం ప్రభలకుండా చర్యలు చేపట్టాం. జైలు పరిసరాలల్లో పాగింగ్ చేస్తున్నాం.జైలులో ఉన్న 2064 మంది ఖైదీలకు, 200 మంది సిబ్బందికి ఆరోగ్య భద్రత చర్యలు చేపట్టాం అని జైళ్ల ఉపశాఖాధికారి లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-09-21T21:20:29+05:30 IST