Nimmala Ramanaidu : జగన్ సైకో బుద్ధితో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు

ABN , First Publish Date - 2023-09-14T12:47:12+05:30 IST

చంద్రబాబునాయుడు హయాంలో ప్రారంభించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల పనితీరుకు మెచ్చి కేంద్రం బంగారు పథకాన్ని ప్రకటించిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 2018లో జగన్ ఈ అవార్డును అందుకుని దీనిని తాను చేసిన గొప్పగా ప్రచారం చేసుకున్నారన్నారు.

Nimmala Ramanaidu : జగన్ సైకో బుద్ధితో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు

కాకినాడ : చంద్రబాబునాయుడు హయాంలో ప్రారంభించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల పనితీరుకు మెచ్చి కేంద్రం బంగారు పథకాన్ని ప్రకటించిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 2018లో జగన్ ఈ అవార్డును అందుకుని దీనిని తాను చేసిన గొప్పగా ప్రచారం చేసుకున్నారన్నారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో అవకతవకలు లేకున్నా అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. తాను జైలుకి వెళ్లాను కాబట్టి అందరూ వెళ్లాలనే సైకో బుద్ధితోనే రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని రామానాయుడు పేర్కొన్నారు. అక్రమ అరెస్టును ఖండిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు చంద్రబాబుకు మద్దతు పలకడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన సంయుక్త పోరాటాలకు సిద్ధం కావాలని నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-14T12:47:12+05:30 IST