Janasena: మీరు తిన్న ఉప్మాకూ డబ్బులు పంపుతున్నాం.. ముద్రగడకు జనసేన నేతల ఝలక్

ABN , First Publish Date - 2023-06-22T16:22:24+05:30 IST

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు జనసేన నేతలు ఝలక్ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ముద్రగడకు వెయ్యి రూపాయిల చొప్పున మనియార్డర్ పంపుతున్నారు. ఇందు కోసం యువకులు వందల్లో పోస్ట్ ఆఫీస్‌ల వద్ద క్యూ కట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌ను విమర్శిస్తూ ఇటీవల ముద్రగడ లేఖ రాసిన విషయం తెలిసిందే.

Janasena: మీరు తిన్న ఉప్మాకూ డబ్బులు పంపుతున్నాం.. ముద్రగడకు జనసేన నేతల ఝలక్

కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు (Mudragada Padmanabham) జనసేన నేతలు ఝలక్ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ముద్రగడకు వెయ్యి రూపాయిల చొప్పున మనియార్డర్ పంపుతున్నారు. ఇందు కోసం యువకులు వందల్లో పోస్ట్ ఆఫీస్‌ల వద్ద క్యూ కట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌ను (Janasena Chief Pawan kalyan) విమర్శిస్తూ ఇటీవల ముద్రగడ లేఖ రాసిన విషయం తెలిసిందే. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (Kakinada MLa Dwarampudi Chandrashekar Reddy) గతంలో కాపు ఉద్యమానికి సహకరించారని లేఖలో ముద్రగడ కొనియాడారు. దీంతో కాపు ఉద్యమంలో ముద్రగడతో ప్రయాణించినప్పుడు తెలియక ఆయనతో ఉప్మా తిన్నామని జనసేన నేతలు వ్యాఖ్యలు చేశారు. ఆ ఉప్మా పంపిన ద్వారంపూడికి డబ్బులు తిరిగి పంపాలంటూ ముద్రగడకు వేలాదిగా మనియార్డర్లు పంపుతున్నారు. ఉద్యమాన్ని ద్వారంపూడికి తాకట్టు పెట్టిన ముద్రగడ తిరిగి డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ‘‘మీరు తిన్న ఉప్మాకూ డబ్బులు పంపుతున్నాం’’ అంటూ జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-22T16:45:33+05:30 IST