Share News

Kakinada: వైసీపీ నేతల భూ బెదిరింపులతో యువ వైద్యుడు ఆత్మహత్య..

ABN , First Publish Date - 2023-11-26T10:45:51+05:30 IST

కాకినాడ: నగరంలో దారుణం జరిగింది. వైసీపీ నేతల భూ బెదిరింపులతో కాకినాడలో యువ వైద్యుడు నున్న శ్రీ కిరణ్ (33) ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందుతోపాటు స్లీపింగ్ పిల్స్ మింగారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Kakinada: వైసీపీ నేతల భూ బెదిరింపులతో యువ వైద్యుడు ఆత్మహత్య..

కాకినాడ: నగరంలో దారుణం జరిగింది. వైసీపీ నేతల భూ బెదిరింపులతో కాకినాడలో యువ వైద్యుడు నున్న శ్రీ కిరణ్ (33) ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందుతోపాటు స్లీపింగ్ పిల్స్ మింగారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మాజీ మంత్రి కన్నబాబు తమ్ముడు కళ్యాణ్, ఆయన అనుచరులు బెదిరించడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కన్నబాబు తమ్ముడుకు వైద్యుడు నున్న శ్రీ కిరణ్ చెందుర్తి ప్రాంతంలో 6 ఎకరాల భూమి అమ్మారు. దీనికి సంబంధించి రూ. 25 లక్షలు ఇవ్వకుండా కన్నబాబు సోదరుడి అనుచరులు బెదిరింపులకు దిగారు. మరో ఎకరానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారు. కొన్ని రోజులుగా మాజీ మంత్రి కన్నబాబు తమ్ముడు అనుచరులతో డబ్బులు.. డాక్యుమెంట్లు కోసం కిరణ్ సంప్రదింపులు జరిపారు. అయినా ఇవ్వకుండా వేదిస్తుండడంతో మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Updated Date - 2023-11-26T10:45:53+05:30 IST