Narayana: ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటి?.. వారు మనుషులా..పశువులా?

ABN , First Publish Date - 2023-03-20T12:57:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(Andhra Pradesh Assembly) అరాచకానికి నిలయంగా మారింది సీపీఐ జాతీయ కార్యదర్శి

Narayana: ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటి?.. వారు మనుషులా..పశువులా?

అమరావతి/ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(Andhra Pradesh Assembly) అరాచకానికి నిలయంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI National Secretary Narayana) ధ్వజమెత్తారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటి?.. వారు మనుషులా? పశువులా?.. బుచ్చయ్య చౌదరి(Buchaiah Chaudhary) వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉంది. నిరక్షరాస్యులకు ఓటు హక్కు కల్పించి మరి దొంగ ఓట్లు వేయించుకున్నారు. అయినా సరే ఓడిపోవడంతో నిరాశలో కూరుకుపోయారు. అందుకే అసెంబ్లీలో(assembly) ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప, ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదు. టీడీపీ(TDP) ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక, కొడతారా?..స్పీకర్, సీఎం ఇద్దరిదీ తప్పు ఉంది. స్పీకర్ (Speaker), సీఎం జగన్ (CM Jagan) ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అధికారం, సీఎం పదవి శాశ్వతం కాదు. రేపు నువ్వు అటు వైపు ఉంటావు.. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్ చేయాలి. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవడం మాని, బాధితులను సస్పెండ్ చేయడం తగదు. ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యంలో చీకటి రోజు’’ అని నారాయణ అన్నారు.

Updated Date - 2023-03-20T13:26:24+05:30 IST