Share News

CM JAGAN: 26న తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ABN , First Publish Date - 2023-10-24T19:35:30+05:30 IST

26న (గురువారం) ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

CM JAGAN: 26న తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

అమరావతి: 26న (గురువారం) ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంట వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చేరుకోనున్నారు. డి.బి.వి.రాజు లే–అవుట్‌లో జరగనున్న వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం సీఎం జగన్ బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Updated Date - 2023-10-24T19:36:29+05:30 IST