Share News

Chittoor Dist.: గాలి భానుప్రకాష్ కారుపై వైసీపీ నేతల దాడి..

ABN , First Publish Date - 2023-10-13T13:58:31+05:30 IST

చిత్తూరు జిల్లా: నగరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నగరి ఇన్‌చార్జ్ గాలి భానుప్రకాష్ కారుపై వైసీపీ నేతలు దాడి చేశారు. జనసేన ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి వెళుతుంటే ఈ ఘటన జరిగింది.

Chittoor Dist.: గాలి భానుప్రకాష్ కారుపై వైసీపీ నేతల దాడి..

చిత్తూరు జిల్లా: నగరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నగరి ఇన్‌చార్జ్ గాలి భానుప్రకాష్ (Gali Bhanuprakash) కారుపై వైసీపీ నేతలు (YCP Leaders) దాడి చేశారు. జనసేన (Janasena) ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి వెళుతుంటే ఈ ఘటన జరిగింది. శుక్రవారం నగరి ప్రభుత్వ ఆసుపత్రి వైపు నుంచి అన్నదానం చేసే ప్రాంతానికి గాలి భాను వెళుతుంటే వైసీపీ శ్రేణులు కారును అడ్డుకుని దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఘటన స్దలానికి భారీగా చేరుకుంటున్నారు.

కాగా నగిరిలో రైతులకు అన్నదానం చేయటాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 30 యాక్ట్ అమల్లో ఉందని, ముందస్తు అనుమతి లేదంటూ అన్నదానాన్ని అడ్డుకున్నారు. మంత్రి రోజా ఆదేశాలతోనే పోలీసు ఉన్నతాధికారులు ఆడుతున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో రైతులకు చేయదలచిన అన్నదానంను జనసేన నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్, రుయా వద్ద పంపిణీ చేస్తున్నారు.

Updated Date - 2023-10-13T13:58:31+05:30 IST