Home » Nagari
మంత్రి రోజా నామినేషన్ అంటే ఎలా ఉంటుంది? దుమ్ము లేచిపోతుందో లేదో కానీ లిక్కర్ మాత్రం పొంగి పొర్లుతోంది. పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్ చేయడం జరిగింది. సుమారు 250 కేసుల మద్యాన్ని ఒక ప్రైవేటు కళాశాలలో వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు డంప్ చేశారు. రాత్రి ఒంటి గంటకు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు పట్టుబడ్డాడు.
సొంత నియోజకవర్గంలో మంత్రి రోజాకు(Minister Roja) బిగ్ షాక్ తగిలింది. సొంత పార్టీ నేతలే ఆమె అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా నగరి(Nagari) నియోజకవర్గ ఐదు మండలాల వైసీపీ(YSRCP) నాయకులు ఆమె వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ నియోజకవర్గానికి రోజా వొద్దని, ఆమెకు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్ను అభ్యర్థించారు. ‘జగనన్న ముద్దు - రోజా వద్దు’ అంటూ నగరి నియోజకవర్గ 5 మండలాల
Roja Contest As MP..? ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు (AP 2024 Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడేం ప్రకటన వస్తుందో.. ఎక్కడ తమ సీటుకు ఎసరుపడుతుందో అని సిట్టింగులు టెన్షన్ టెన్షన్తోనే గడిపేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను వదలని సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు మంత్రులకు కూడా స్థానచలనం చేస్తున్నారు. అది కూడా ఏ మాత్రం పరిచయం, సంబంధమే లేని జిల్లాలకు మారుస్తుండటంతో అవాక్కవుతున్న పరిస్థితి..
Andhrapradesh: మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. రోజాకు టిక్కెట్ ఇస్తే తాము పని చేసే ప్రసక్తే లేదని.. కొత్త వారికి ఇస్తేనే పార్టీ గెలుపుకు కృషి చేస్తామని జడ్పీటీసీలు తేల్చిచెబుతున్నారు.
చిత్తూరు జిల్లా: నగరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నగరి ఇన్చార్జ్ గాలి భానుప్రకాష్ కారుపై వైసీపీ నేతలు దాడి చేశారు. జనసేన ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి వెళుతుంటే ఈ ఘటన జరిగింది.
ముఖ్యమంత్రి జగన్ సభ కోసం నగరిలో ట్రాఫిక్ ఆంక్షలతో పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుండగా.. మరోవైపు సభకు విద్యార్థులను తరలించేందుకు ఏకంగా పరీక్షలనే రద్దు చేశారు. సీఎం జగన్ సభకు విద్యార్థిని విద్యార్థులను తరలించడానికి ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలను కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు అక్రమంగా రద్దు చేశాయి.
సీఎం జగన్ పర్యటిస్తున్నారంటే చాలు అక్కడి అధికారులు, పోలీసుల హడావుడి అంతా ఇంతా కాదు. సీఎం వచ్చి వెళ్లేదాకా ఆ ప్రాంతవాసులకు చుక్కలు కనిపించడం ఖాయం. సీఎం వెళ్లే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటారు.
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు బటన్ నొక్కి విద్యాదీవెన, వసతిదీవెన విడుదల చేయనున్నారు.
చిత్తూరు జిల్లా: నగరి సీఐ వాసంతి (CI Vasanti) అనుచితంగా ప్రవర్తించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన టీడీపీ నేతల (TDP Leaders)పై బూతులు ప్రయోగించారు.
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Royal) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.