TTD: తిరుమలలో గదుల ధరల పెంపును సమర్థించుకున్న టీటీడీ
ABN , First Publish Date - 2023-01-12T18:10:10+05:30 IST
తిరుమల (Tirumala)లో గదుల ధరల పెంపును టీటీడీ (TTD) ఈవో సమర్థించుకున్నారు.
తిరుమల: తిరుమల (Tirumala)లో గదుల ధరల పెంపును టీటీడీ (TTD) ఈవో సమర్థించుకున్నారు. ధనికులకు కేటాయించే గదుల ధరలనే పెంచామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ధరల పెంపుతో సామాన్యులపై ఎటువంటి భారం మోపలేదని, గదుల ధరల పెంపు విషయంలో రాజకీయాలు బాధాకరమని టీటీడీ ఈవో అన్నారు. తిరుమలలో మొత్తం 7,500 గదులు, 4 యాత్రిక సదన్లు ఉన్నాయని, 50,100 రూపాయల గదులు 5 వేలు ఉన్నాయని, వాటి ధరలను 40 ఏళ్ల క్రితం నిర్ణయించారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రూ.120 కోట్ల వ్యయంతో పలు గదులను ఆధునీకరించామని టీటీడీ ఈవో వెల్లడించారు.