Share News

AP News: ప్రభుత్వ కబంధ హస్తాల్లో తిరుమల ఆలయం.. పరిరక్షించండంటూ మోదీకి రమణ దీక్షితులు వినతి

ABN , First Publish Date - 2023-11-27T11:43:48+05:30 IST

తిరుమల ఆలయం ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని.. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రమణ దీక్షితులు విజ్ఞప్తి చేశారు. హిందూ దేవాలయాల పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను టీటీడీలోని సనాతన అధికారి క్రమ పద్ధతిలో నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు.

AP News: ప్రభుత్వ కబంధ హస్తాల్లో తిరుమల ఆలయం.. పరిరక్షించండంటూ మోదీకి రమణ దీక్షితులు వినతి

తిరుమల: తిరుమల ఆలయం ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని.. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రమణ దీక్షితులు విజ్ఞప్తి చేశారు. హిందూ దేవాలయాల పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను టీటీడీలోని సనాతన అధికారి క్రమ పద్ధతిలో నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. దయచేసి శ్రీవారి ఆలయాన్ని రక్షించి ఇక్కడ వెంటనే హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని.. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని మోదీకి రమణ దీక్షితులు ట్విటర్ వేదికగా తెలిపారు.

Updated Date - 2023-11-27T11:43:50+05:30 IST