Chandrababu: జగన్ ప్రభుత్వంలో వణుకుపుట్టింది

ABN , First Publish Date - 2023-01-04T17:48:28+05:30 IST

కుప్పం వస్తానని నెల క్రితమే ప్రకటించానని టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) తెలిపారు.

Chandrababu: జగన్ ప్రభుత్వంలో వణుకుపుట్టింది

కుప్పం, చిత్తూరు: కుప్పం వస్తానని నెల క్రితమే ప్రకటించానని టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) తెలిపారు. కుప్పం పర్యటనపై డీజీపీకి (DGP) లేఖ రాశానని, ప్రభుత్వం అక్రమంగా చీకటి జీవో తెచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ (JAGAN), పోలీసుల (police) దయాదాక్షిణ్యాలతోనే సభలు పెట్టుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్ననే విజయనగరంలో వైసీపీ మీటింగ్‌ పెట్టుకుందని ప్రస్తావించారు. వైసీపీ పనైపోయిందని, టీడీపీనే రాష్ట్రాన్ని కాపాడగలదని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. అందుకే తమ మీటింగ్‌కు ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తిరిగే, మాట్లాడే స్వేచ్ఛ ఉందని అన్నారు. తన నియోకవర్గంలో తాను పర్యటించకూడదా.. తన ప్రజలతో మాట్లాడకూడదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ పనైపోయిందని.. ప్రభుత్వంలో వణుకుపుట్టిందని, పోలీసులు ప్రజల కోసమే పని చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.

Updated Date - 2023-01-04T20:06:58+05:30 IST