Pawan Kalyan: ప్రత్యేక విమానంలో విజయవాడకు పవన్ కళ్యాణ్.. అనుమతి ఇవ్వని ఏపీ పోలీసులు
ABN , First Publish Date - 2023-09-09T16:48:47+05:30 IST
విజయవాడలో చంద్రబాబును కలవాలని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేవలం కుటుంబసభ్యులకు మాత్రమే ఆయన్ను కలిసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వొద్దంటూ గన్నవరం విమానాశ్రయం అధికారులను ఏపీ పోలీసులు కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లో ఆయన విజయవాడలోని సిట్ కార్యాలయానికి చేరుకోనున్నారు. దీంతో విజయవాడలోని సివిల్ కోర్టు పరిసరాలతో పాటు సీఐడీ, టీడీపీ, వైసీపీ కార్యాలయాల వద్ద పోలీసులు కాపు కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడలో చంద్రబాబును కలవాలని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేవలం కుటుంబసభ్యులకు మాత్రమే ఆయన్ను కలిసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వొద్దంటూ గన్నవరం విమానాశ్రయం అధికారులను ఏపీ పోలీసులు కోరారు.
ఇది కూడా చదవండి: Galla Jayadev: చంద్రబాబును అరెస్టు చేసిన తీరు బాధాకరం
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా అర్ధరాత్రి చంద్రబాబును అరెస్ట్ చేశారని.. జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే ఈ అరెస్ట్ జరిగిందని పవన్ ఆరోపించారు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబు విజయవాడ చేరుకున్న తర్వాత ఆయన్ను భార్య నారా భువనేశ్వరి, కుమారుడు లోకేష్ కలవనున్నారు. తన తండ్రి అరెస్ట్తో యువగళం పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన లోకేష్ అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై న్యాయవాదులతో సమీక్షించారు. తన తండ్రికి బెయిల్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును రిమాండ్కు ఇవ్వాలని సీఐడీ కోరుతుండగా.. సీఐడీ రిమాండ్ పిటిషన్ను తిరస్కరించాలని టీడీపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో న్యాయమూర్తి నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.