Lokesh: వడ్డెరలకు శుభవార్త చెప్పిన నారా లోకేష్

ABN , First Publish Date - 2023-03-27T18:26:55+05:30 IST

ఏపీ (AP)లో అన్ని వర్గాలను జగన్ (CM Jagan) ప్రభుత్వం అన్యాయం చేసిందని టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Lokesh: వడ్డెరలకు శుభవార్త చెప్పిన నారా లోకేష్

శ్రీసత్యసాయి: ఏపీ (AP)లో అన్ని వర్గాలను జగన్ (CM Jagan) ప్రభుత్వం అన్యాయం చేసిందని టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. 52వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ (CCS) రద్దు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. చివరికి పోలీసులు భత్యాలను సక్రమంగా అందించడం లేదని మండిపడ్డారు. కుర్చీలు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దగా చేశారని ధ్వజమెత్తారు. వడ్డెర వృత్తి చేసుకునేందుకు గతంలో కేటాయించిన క్వారీలను వైసీపీ (YCP) నేతలు కబ్జా చేశారని లోకేష్ ఆరోపించారు. క్వారీలను తిరిగి వారికి అప్పగించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఏపీలో అధికారంలోకి రాగానే వడ్డెరలకు గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధిహామీ కింద వడ్డెరలకు పనులు కేటాయిస్తామన్నారు. కియా అనుబంధ సంస్థలను తాము తీసుకువస్తామన్నారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర అందించే బాధ్యత టీడీపీదన్నారు.

Updated Date - 2023-03-27T18:26:55+05:30 IST