పరిస్థితి చేయి దాటకముందే ఆయన్ను పక్కన పెట్టాలి: రఘురామ

ABN , First Publish Date - 2023-03-27T23:28:51+05:30 IST

వైసీపీలో సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు.

పరిస్థితి చేయి దాటకముందే ఆయన్ను పక్కన పెట్టాలి: రఘురామ

ఢిల్లీ: వైసీపీలో సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు. పరిస్థితి చేయి దాటకముందే సజ్జలను పక్కన పెట్టాలన్నారు. ఎమ్మెల్యేలు అందరూ సజ్జలకు రిపోర్టు చేయాలనడం సరికాదని చెప్పారు. రాజకీయ పార్టీ అంటే ఎవరి అబ్బా, బాబు సొత్తు కాదన్నారు. పార్టీ సభ్యులందరికీ అధినేత జవాబుదారీగా ఉండాలని రఘురామ సూచించారు. మీ వ్యక్తిగత జీవితంలో ఇష్టం వచ్చినట్లు ఉంటానంటే చెల్లుతుందన్నారు.

ఇదిలావుండగా... వచ్చే ఎన్నికలపై ఎంపీ రఘురామకృష్ణ రాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందని చెబుతూనే.. తన దగ్గర లేటెస్ట్ సర్వే డేటా ఉందని చెప్పుకొచ్చారు. లెక్కలు లేకుండా తాను మాట్లాడనని.. ఈసారి ఎన్నికల్లో విడివిడిగా కాదు.. జనసేన పార్టీ (Janasena Party), టీడీపీ (TDP)లు కలిసే పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు.

Updated Date - 2023-03-27T23:28:54+05:30 IST