Allu Arjun: టీడీపీ నేత ఫాంహౌస్‌కు అల్లు అర్జున్.. ఎందుకెళ్లాడంటే..

ABN , First Publish Date - 2023-07-08T13:49:42+05:30 IST

సినీ హీరో అల్లు అర్జున్‌కు టీడీపీ జిల్లా నాయకులు రాయలసీమ రుచులతో విందు ఇచ్చారు. టీడీపీ శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఈ విందు ఏర్పాటు చేశారు.

Allu Arjun: టీడీపీ నేత ఫాంహౌస్‌కు అల్లు అర్జున్.. ఎందుకెళ్లాడంటే..

అల్లు అర్జున్‌కు సీమ రుచుల విందు

గార్లదిన్నె: సినీ హీరో అల్లు అర్జున్‌కు అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు రాయలసీమ రుచులతో విందు ఇచ్చారు. టీడీపీ శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఈ విందు ఏర్పాటు చేశారు.

20230708_134639.jpg

అల్లు అర్జున్‌ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు శుక్రవారం కారులో వెళ్తూ.. గార్లదిన్నె మండలం కనుంపల్లి వద్దగల ముంటిమడుగు ఫామ్‌హౌస్‌కు వచ్చారు. కేశవరెడ్డి, ఆయన కుమారుడు రాహుల్‌రెడ్డి.. అల్లు అర్జున్‌కు స్వాగతం పలికారు.

20230708_134655.jpg

రాయలసీమ వంటకాలతో భోజనం పెట్టారు. అల్లు అర్జున్‌ వచ్చిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ పెద్దఎత్తున తరలిరావడంతో ఫామ్‌హౌస్‌ కిటకిటలాడింది.

20230708_134645.jpg

ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అనంతరం అల్లు అర్జున్‌ బెంగళూరుకు వెళ్లారు.

Updated Date - 2023-07-08T14:17:52+05:30 IST