Anantapuram: రాయదుర్గంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ

ABN , First Publish Date - 2023-10-08T08:24:19+05:30 IST

అనంతపురం జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాయదుర్గంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి లక్ష్మి బజార్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగనుంది.

Anantapuram: రాయదుర్గంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ

అనంతపురం జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు (National President of Telugu Desam Party), మాజీ ముఖ్యమంత్రి (Ex CM) చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టు (Arrest)ను నిరసిస్తూ రాయదుర్గంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ (Protest Rally) చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం (NTR Statue) నుంచి లక్ష్మి బజార్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగనుంది. ‘బాబు కోసం మేము సైతం’ అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్రమ కేసులో అరెస్టు చేసి 30 రోజులుగా జైల్లో పెట్టారంటూ కమ్మ సంఘం నేతలు మండిపడుతున్నారు.

కాగా బెంగళూరులో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం సమర శంఖారావం కార్యక్రమం జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మారతహళ్ళిలో సమర శంఖారావం జరగనుంది. ఈ సమర శంఖారావం సభకు 20 మందికి పైగా టీడీపీ ముఖ్య నేతలు హాజరవుతున్నారు. మారతహళ్ళిలోని ఎస్బీఆర్ ప్యాలెస్‌లో సమర శంఖారావంకు భారీ ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-10-08T08:24:19+05:30 IST