Share News

AP News: వేలాదిగా టీడీపీ శ్రేణులతో బయలుదేరిన ఎన్టీఆర్‌ ఎక్స్‌ప్రెస్ రైలు

ABN , Publish Date - Dec 19 , 2023 | 11:54 AM

Andhrapradesh: యువగళం నవశకం బహిరంగ సభకు వేలాదిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు బయలుదేరారు. యువగళం నవశకం బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు.

AP News: వేలాదిగా టీడీపీ శ్రేణులతో బయలుదేరిన ఎన్టీఆర్‌ ఎక్స్‌ప్రెస్ రైలు

అనంతపురం: యువగళం నవశకం బహిరంగ సభకు వేలాదిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు బయలుదేరారు. యువగళం నవశకం బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ధర్మవరంలో ప్రారంభమైన ఎన్టీఆర్‌ ఎక్స్‌ప్రెస్ రైలు అనంతపురం, గుత్తి రైల్వే స్టేషన్లలో టీడీపీ కార్యకర్తలను ఎక్కించుకుని బయలుదేరింది. ధర్మవరం, అనంతపురం గుత్తి రైల్వే స్టేషన్‌కు వేలాదిగా తెలుగదేశం శ్రేణులు చేరుకున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు విజయనగరానికి బయలుదేరారు. టీడీపీ శ్రేణుల రాకతో అనంతపురం రైల్వే స్టేషన్ పసుపుమయంగా మారిపోయింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 19 , 2023 | 11:56 AM