Share News

AP NEWS: అనంతపురం జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:25 PM

జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం రోటరిపురం వద్ద ఉన్న ఎస్ఆర్‌ఐటీ (SRIT) కళాశాలల్లో కవిత (21)అనే విద్యార్థిని ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుకుంటుంది.

AP NEWS: అనంతపురం జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

అనంతపురం : జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం రోటరిపురం వద్ద ఉన్న ఎస్ఆర్‌ఐటీ (SRIT) కళాశాలల్లో కవిత (21)అనే విద్యార్థిని ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుకుంటుంది. సోమవారం కళాశాల హాస్టల్‌ (Hostel)లో ఉంటున్న ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని స్వగ్రామం పుట్లూరు మండలం ఏ. కొండాపురం గ్రామంగా పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Dec 18 , 2023 | 10:25 PM