Bandi Sanjay: యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు?

ABN , First Publish Date - 2022-11-28T15:50:20+05:30 IST

కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Telangana BJP president Bandi Sanjay) ప్రకటించారు. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో

Bandi Sanjay: యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు?
ప్రభుత్వానికి భయమెందుకు?

కరీంనగర్: కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Telangana BJP president Bandi Sanjay) ప్రకటించారు. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బైంసా ప్రజల నుంచి బండి సంజయ్‌ను దూరం చేయలేరని తెలిపారు. ఎంఐఎం(MIM), టీఆర్ఎస్(TRS) ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. బైంసాకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? బైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా? ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం.. మజ్లిస్ నేతలు చెప్పినట్లు నడుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.

Updated Date - 2022-11-28T15:50:22+05:30 IST