Rahul jodo yatra: కూకట్‌పల్లిలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-11-02T09:24:35+05:30 IST

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర భాగ్యనగరంలో కొనసాగుతోంది.

Rahul jodo yatra: కూకట్‌పల్లిలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

హైదరాబాద్: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) భారత్ జోడో పాదయాత్ర (Bharat jodo yatra) భాగ్యనగరంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం కూకట్ పల్లి, జెఎన్టీయూ మీదుగా రాహుల్ పాదయాత్ర సాగుతోంది. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు పక్కన టీ తాగారు. ఉదయం 10 గంటలకు హోటల్ కినేరా గ్రాండ్ వద్ద మార్నింగ్ బ్రేక్ ఇవ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ బస్ స్టాండ్ నుంచి తిరిగి యాత్ర ప్రారంభంకానుంది. మియాపూర్, రామచంద్రపురం, పఠాన్‌చెరు వరకు పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 7 గంటలకు హరిదోశ ముత్తంగి వద్ద కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. రుద్రారమ్ గణేష్ మందిర్‌లో రాహుల్‌ గాంధీ నైట్ హాల్ట్ చేయనున్నారు.

నేడు మెదక్ జిల్లాలోకి రాహుల్ పాదయాత్ర...

మరోవైపు ఈరోజు రాహుల్ జోడో యాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ప్రవేశించనుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం లింగంపల్లికి ఇవాళ సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర చేరుకోనుంది. పటాన్ చెర్, సంగారెడ్డి, ఆందోలు , నారాయణ ఖేడ్ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుంది. ఈ నెల ఆరో తేదీ వరకు జిల్లాలో పాదయాత్ర కొనసాగనుంది. ఎంపీగా ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కావడంతో నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల నాలుగో తేదీన పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు.

Updated Date - 2022-11-02T09:24:45+05:30 IST