Telangana Highcourt: బండి సంజయ్ పాదయాత్ర పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-11-28T12:36:31+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Telangana Highcourt: బండి సంజయ్ పాదయాత్ర పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర (Bandi Sanjay Padayatra) పిటిషన్‌పై హైకోర్టు (Telangana High court)లో విచారణ జరిగింది. పిటిషన్ తరపున న్యాయవాది రామచందర్ రావు వాదనలు వినిపించారు. బైంసా లోపలి నుంచి పాదయాత్ర వెళ్లదని రామచందర్ రావు కోర్టుకు తెలిపారు. రూట్ మ్యాప్ వివరాలు కోర్టుకు సమర్పించారు. బైంసా వై జంక్షన్ నుంచి పాదయాత్ర వెళ్తుందని చెప్పారు. బైంసా టౌన్‌లోకి పాదయాత్ర ప్రవేశించదని స్పష్టం చేశారు. బైంసా టౌన్‌లోకి ప్రవేశించనప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. బైంసా చాలా సున్నితమైన ప్రాంతం అని ఏజీ బిఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలియజేశారు. శాంతి భద్రలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఏజీ వెల్లడించారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2022-11-28T12:36:33+05:30 IST