మహిళతో వెనుకే గుడిలోకి వెళ్లిన యువకుడు.. అందరి ముందు ఒక్కసారిగా..

ABN , First Publish Date - 2022-12-20T21:22:38+05:30 IST

మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువకులు.. చివరకు ఎంతటి నేరాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇంకొందరు యువకులు బాలికలు, యువతులు, మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడడం తరచూ చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో ..

మహిళతో వెనుకే గుడిలోకి వెళ్లిన యువకుడు.. అందరి ముందు ఒక్కసారిగా..

మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువకులు.. చివరకు ఎంతటి నేరాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇంకొందరు యువకులు బాలికలు, యువతులు, మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడడం తరచూ చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్‌కు అలవాటు పడిన యువకుడు.. మహిళలను టార్గెట్ చేస్తూ ఉండేవాడు. ఓ రోజు గుడి వద్ద మహిళలను ఫాలో అయ్యాడు. ఆలయం లోపల అందరి ముందు అతడు చేసిన తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..

గుడికి వెళ్లిన తండ్రీకూతుళ్లు.. తిరిగి వస్తుండగా సడన్‌గా కూతురు కిడ్నాప్.. మధ్యాహ్నం తండ్రికి ఫోన్ చేసిన యువతి..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి ప్రకాష్ననగర్‌లోని శివాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ రోజు ఆలయంలో కొందరు మహిళలు స్వామిని దర్శించుకుంటున్నారు. అదే సమయంలో స్థానిక ప్రాంతానికి చెందిన వసీం అనే యువకుడు ఆలయం (temple) వద్ద తిరుగుతూ ఉన్నాడు. ఓ మహిళను టార్గెట్ చేసిన అతను.. ఆమె వెనుకే ఆలయంలోకి వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా తనలోని శాడిజాన్ని బయటపెట్టాడు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు.

భర్తను చంపి.. మృతదేహం పక్కనే రాత్రంతా నిద్రపోయిన భార్య.. నాన్నను లేపొద్దంటూ పిల్లలకు చెప్పి..

దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే కాసేపటికి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. విచారణలో నిందితుడు డ్రగ్స్‌కు (Drugs) అలవాటు పడి వివిధ నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

రాత్రి వేళ భర్త ప్రియురాలి ఇంటికి.. పరాయి వ్యక్తితో కలిసి వెళ్లిన భార్య.. ఊహించని విధంగా..

Updated Date - 2022-12-20T21:24:08+05:30 IST