కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. మూడేళ్లుగా ఇంట్లో చేసిన నిర్వాకం.. సడన్‌గా..

ABN , First Publish Date - 2022-11-09T18:32:48+05:30 IST

ప్రేమికులు పెళ్లి వరకూ వెళ్లే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రధానంగా తల్లిదండ్రుల నుంచే సమస్యలు తలెత్తుతుంటాయి. కూతుళ్ల ప్రేమ విషయంలో కొందరు తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. తాము చెప్పినట్లే వినాలి, తాము తెచ్చిన సంబంధాన్నే ఒప్పుకోవాలి.. అంటూ..

కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. మూడేళ్లుగా ఇంట్లో చేసిన నిర్వాకం.. సడన్‌గా..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమికులు పెళ్లి వరకూ వెళ్లే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రధానంగా తల్లిదండ్రుల నుంచే సమస్యలు తలెత్తుతుంటాయి. కూతుళ్ల ప్రేమ విషయంలో కొందరు తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. తాము చెప్పినట్లే వినాలి, తాము తెచ్చిన సంబంధాన్నే ఒప్పుకోవాలి.. అంటూ కండీషన్లు పెడుతుంటారు. విననిపక్షంలో కూతురు అని కూడా చూడకుండా దాడులకు దిగుతుంటారు. కొందరైతే మరీ రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. మూడేళ్లుగా చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. చివరకు సడన్‌గా కూతురు షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

తల్లీకొడుకులు అయి ఉండి ఇదేం పని.. అచ్చం విజయ్ సినిమాల్లో చూపించినట్టుగానే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతికి.. ఎనిమిదేళ్ల క్రితం ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఎలాగైనా కలిసి జీవించాలని అనుకున్నారు. ఇంట్లో తెలీకుండా ఇద్దరూ కలుసుకునేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత వీరి ప్రేమ (love) విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పాటూ కూతురిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెప్పినట్లే వినాలంటూ కండీషన్ పెట్టి.. బయటికి వెళ్లకుండా ఇంట్లో బంధించారు. తనకు చదువుకోవాలని ఉంది అని చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా కట్టడి చేశారు.

Viral Video: కారు బానెట్‌పై కూర్చుని మరీ యువతి విన్యాసాలు.. పోలీసుల కంట పడటంతో..

మూడేళ్లుగా ఇంట్లోనే బంధించడంతో యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి (mental stress) గురైంది. అయితే పది రోజుల క్రితం ఎలాగోలా ఇంటి నుంచి బయటపడి.. ప్రియుడితో కలిసి ఢిల్లీకి వెళ్లింది. అనంతరం ఇద్దరూ వివాహం (marriage) చేసుకున్నారు. దీంతో ఆమెకు కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు (Threats) మొదలయ్యాయి. తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించి (Police complaint) ఫిర్యాదు చేసింది. తాము ఇద్దరూ మేజర్లమని, భర్తతోనే కలిసి ఉంటానని.. రక్షణ కల్పించాలని వేడుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఓ వైపు కూతురు ట్యూషన్ చెబుతుంటే.. మరోవైపు తండ్రి చేసిన నిర్వాకం.. రోజూ చాక్లెట్లు ఇస్తూ..

Updated Date - 2022-11-09T18:33:33+05:30 IST