OYO Room: ప్రియుడిని కలిసిన వివాహిత.. బాత్రూంకు వెళ్లి 10 నిమిషాల తర్వాత తిరిగొచ్చిన ప్రేయసికి గదిలో షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2022-12-28T18:07:28+05:30 IST

ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఎవరికీ తెలీకుండా తరచూ ఇద్దరూ కలుస్తూ ఉండేవారు. ఇటీవల..

OYO Room: ప్రియుడిని కలిసిన వివాహిత.. బాత్రూంకు వెళ్లి 10 నిమిషాల తర్వాత తిరిగొచ్చిన ప్రేయసికి గదిలో షాకింగ్ సీన్..!
ప్రతీకాత్మక చిత్రం

ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఎవరికీ తెలీకుండా తరచూ ఇద్దరూ కలుస్తూ ఉండేవారు. ఇటీవల ఓయో రూమ్‌లో ఉన్న ప్రియుడిని కలిసింది. అయితే మాటల మధ్యలో ఆమె బాత్రూంకు వెళ్లింది. పది నిముషాల తర్వాత బయటికి వచ్చి చూసేసరికి.. బెడ్ రూమ్‌లో షాకింగ్ సీన్ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు.. కొన్నాళ్లకు అతిథి గృహంలో ప్రత్యక్షం.. ఓ రోజు రాత్రి బాలిక ఫొటోను చేతిలో పట్టుకుని..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్‌ పరిధి సాహిబాబాద్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానిక చెందిన మహిళకు వివాహమై.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈమెకు కొన్ని నెలల క్రితం ఢిల్లీలోని మండౌలీ ప్రాంతానికి చెందిన కైలాష్ (29) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వీరి పరిచయం.. వివాహేతర సంబంధానికి (extramarital affair) దారి తీసింది. తరచూ ఇద్దరూ కలుస్తూ ఉండేవారు. తాజాగా, మంగళవారం కైలాష్.. సాహిబాబాద్ పరిధిలోని ఓయో హోటల్లో (Oyo Hotel) గదిని తీసుకున్నాడు. ప్రియురాలికి (girlfriend) ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. దీంతో ఆమె కూడా అక్కడికి వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లిన రెండు గంటల తర్వాత.. ఇంటికి వెళ్లాలంటూ సదరు మహిళ తన ప్రియుడితో చెప్పింది. ఇందుకు అతను ఒప్పుకోలేదు.

అల్లుడి నోట అలాంటి మాటలు విని షాక్‌తో చనిపోయిన అత్త.. కేసు పెట్టిన భార్య.. అసలు కథేంటంటే..!

ఇంకా కొన్ని గంటలు గదిలోనే ఉందామంటూ ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఆమె బాత్‌రూంకు వెళ్లింది. పది నిముషాల తర్వాత బయటికి వచ్చి చూస్తే.. కైలాష్ ఫ్యాన్‌కు వేలాడుతూ (Suicide) కనిపించాడు. దీంతో పోలీసులకు పోన్ చేసి విషయం తెలియజేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కైలాష్ మృతికి ప్రియురాలితో జరిగిన వాగ్వాదమే కారణమా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: పని మనిషిని లిఫ్ట్ నుంచి బలవంతంగా లాక్కెళ్లిన యజమాని.. వద్దని వేడుకుంటున్నా వినకుండా..

Updated Date - 2022-12-28T18:17:43+05:30 IST