Lokesh: జగన్‌ను నమ్మి మోసపోవద్దు.. మంగళగిరిలో పేదలకు 10 వేల ఇళ్లు కట్టిస్తాం

ABN , First Publish Date - 2022-11-11T22:49:55+05:30 IST

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)పై ఏపీ మాజీ నారా లోకేష్ (Lokesh) విమర్శలు గుప్పించారు.

Lokesh: జగన్‌ను నమ్మి మోసపోవద్దు.. మంగళగిరిలో పేదలకు 10 వేల ఇళ్లు కట్టిస్తాం

గుంటూరు: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)పై ఏపీ మాజీ నారా లోకేష్ (Lokesh) విమర్శలు గుప్పించారు. జగన్‌రెడ్డి తప్పుడు ప్రచారాలు నమ్మి మోసపోవద్దని లోకేష్‌ సూచించారు. చెత్త పన్ను కట్టట్లేదని వృద్ధుల ఫించన్లకు కోత పెడుతున్నాడని విమర్శించారు. ఇప్పటంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేనే పేదల ఇళ్లు కూలగొట్టించాడని నారా లోకేష్‌ ఆరోపించారు. అధికారం లేకపోయినా 12 సంక్షేమ పథకాలను అందిస్తున్నామని నారా లోకేష్‌ చెప్పారు. మళ్ళీ అధికారంలోకి రాగానే అటవీ భూమిని డీనోటిఫై చేస్తామని, సైకో పాలన పోయి త్వరలో సైకిల్ పాలన వస్తుందని నారా లోకేష్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలో పేదలకు 10 వేల ఇళ్లు కట్టిస్తామని నారా లోకేష్‌ తెలిపారు.

Updated Date - 2022-11-11T22:58:37+05:30 IST