TDP: ఎమ్మెల్సీ శత్రుచర్లను మందలించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-12-24T12:54:45+05:30 IST

టీడీపీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజును ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మందలించారు.

TDP: ఎమ్మెల్సీ శత్రుచర్లను మందలించిన చంద్రబాబు

విజయనగరం: టీడీపీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు (Shatrucharla Vijayaramaraju) ను ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మందలించారు. కురుపాం నియోజకవర్గం టీడీపీ నేత దత్తి లక్ష్మణరావు, ఆయన వర్గాన్ని సస్పెండ్ చేశామని చంద్రబాబుకు విజయరామరాజు వివరించారు. అయితే దీనిపై టీడీపీ అధినేత అభ్యంతరం వ్యక్తం చేశారు. కీలకమైన నిర్ణయాలు పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పెద్దరికంగా సర్ది చెప్పాలి తప్ప.. సస్పెండ్ చేయకూడదన్నారు. ఈ తరహా ఘటనలు మరోసారి తన దృష్టికి తీసుకురావద్దని చంద్రబాబు తేల్చిచెప్పారు.

Updated Date - 2022-12-24T12:54:46+05:30 IST