Pawan Kalyan meets Modi: ఎనిమిదేళ్ల తర్వాత మోదీని కలిశా: జనసేనాని

ABN , First Publish Date - 2022-11-11T21:59:40+05:30 IST

విశాఖ: ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని కలిశానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Jana Sena Chief Pawan Kalyan) చెప్పారు.

Pawan Kalyan meets Modi: ఎనిమిదేళ్ల తర్వాత మోదీని కలిశా: జనసేనాని
Pawan Kalyan meets Modi

విశాఖ: ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని కలిశానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Jana Sena Chief Pawan Kalyan) చెప్పారు. విశాఖపట్టణం (Visakhapatnam)లోని ఐఎన్ఎస్ చోళ గెస్ట్‌హౌస్‌లో మోదీతో సమావేశమైన పవన్ కల్యాణ్ అరగంట పాటు చర్చలు జరిపారు. బీజేపీ కోర్ కమిటీ భేటీ కంటే ముందే ప్రధానితో సమావేశమైన పవన్‌ కల్యాణ్ పలు అంశాలపై చర్చించారు. తనకు రెండు రోజుల క్రితం పీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని పవన్ చెప్పారు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోదీని కలిశానని, ఏపీలోని పరిస్థితులను మోదీ అడిగి తెలుసుకున్నారని పవన్ చెప్పారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నట్లు పవన్ చెప్పారు. మోదీతో తన సమావేశం ఏపీకి మంచి భవిష్యత్ ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

శనివారం ప్రధాని విశాఖపట్టణంలో 10,500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

Updated Date - 2022-11-11T22:01:28+05:30 IST