CPI, CPM Protest: తిరుపతిలో సీపీఐ, సీపీఎం నిరసన

ABN , First Publish Date - 2022-11-11T11:34:04+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు తిరుపతిలో నిరసనకు దిగారు.

CPI, CPM Protest: తిరుపతిలో సీపీఐ, సీపీఎం నిరసన

తిరుపతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు (CPI, CPM Leaders) తిరుపతిలో నిరసనకు దిగారు. నరేంద్ర మోదీ (Prime minister)గో బ్యాక్ అంటూ ఆందోళన చేపట్టారు. నల్లదుస్తులు ధరించి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) మాట్లాడుతూ... విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయమని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా (Special status)ను వెంటనే ప్రకటించాలని రామకృష్ణ అన్నారు.

Updated Date - 2022-11-11T11:34:05+05:30 IST