AP News: ‘మంత్రి ఉషశ్రీ చరణ్‌కు సిగ్గుండాలి’

ABN , First Publish Date - 2022-11-17T19:15:45+05:30 IST

Anatapuram: మంత్రి ఉషశ్రీ (Ushasree) చరణ్‌పై టీడీపీ (TDP) కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు మద్దతు పలకడానికి మంత్రికి సిగ్గుండాలని మండిపడ్డారు.

AP News: ‘మంత్రి ఉషశ్రీ చరణ్‌కు సిగ్గుండాలి’

Anatapuram: మంత్రి ఉషశ్రీ (Ushasree) చరణ్‌పై టీడీపీ (TDP) కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు మద్దతు పలకడానికి మంత్రికి సిగ్గుండాలని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి (Amaravathi) రాజధానికి మద్దతు పలికి, ఇప్పుడు మూడు రాజధానుల పేరిట వైసీపీ (YCP) ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నియోజకవర్గంలో టీడీపీ హయాంలో రూ. వేల కోట్లు ఖర్చు చేస్తే, అందులో కనీస 10 శాతం కూడా అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం లేదని నాయుడు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఉషశ్రీ కృషిచేయాలని సూచించారు.

Updated Date - 2022-11-17T19:17:50+05:30 IST