Home » Telangana » Adilabad
కాగజ్నగర్, మే 8: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో ప్రధానపార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఆయా అసెంబ్లీ నియోజవర్గాల నుంచి ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రధాన పార్టీల నాయకులు దృష్టి సారిస్తున్నారు.
దహెగాం, మే 8: నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన మండలంలోని అయినం, చిన్నరాస్పెల్లి, దహెగాం, ఒడ్డుగూడ గ్రామాల్లో ఎరువులు, విత్తనాలు విక్రయించే దుకాణాలను తనిఖీ చేశారు.
ఆసిఫాబాద్, మే 8: రాజ్యంగం ప్రమాదంలో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
కాగజ్నగర్, మే 8: పార్లమెంటు ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుకుంది. ప్రచారపర్వం ముగింపునకు ఇంకా మూడు రోజులే ఉండటంతో ఆయాపార్టీల అభ్యర్థులు, నాయకులు తమ కార్యకర్తలతో కార్నర్ మీటింగ్, ఆయా వార్డుల ప్రజలతో విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని పలు మండలాల్లో మంగళ వారం కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, గాలి దుమారంతో కూడిన వర్షం పడటంతో చేతి కొచ్చిన వరి, మామిడి నీటిపాలైంది.
ఎన్నికలను బహిష్కరించవద్దని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే కీలకమని, ఓట్లు వేయండి సమస్యలను పరిష్కరిస్తామని బుధవారం రాజారం గ్రామస్థులతో అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు.
విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేలా జిల్లా సైన్స్ కేంద్రం కృషి చేస్తోందని ఆర్డీవో వడాల రాములు అన్నారు. బుధవారం జిల్లా సైన్స్ కేంద్రంలో విద్యార్థులకు నిర్వహించిన సైన్స్ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో అతిథిగా పాల్గొని మాట్లా డారు.
పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సామా న్యులను పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. బుధవారం బెల్లంపల్లిలో విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లా కేంద్రంలో బుధవారం ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం వృద్ధాశ్రమంలో పతాకాన్ని ఆవిష్కరించారు.
జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. 3.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షానికి రైతులకు అపార నష్టం వాటిల్లింది. పలు మం డలాల్లో కోతకు వచ్చిన మామిడి నేలరాలగా, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది.