Share News

PM Modi: వేములవాడ, వరంగల్‌లో నేడు ప్రధాని మోదీ పర్యటన

ABN , Publish Date - May 08 , 2024 | 07:18 AM

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వేములవాడ, వరంగల్‌లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.

PM Modi:  వేములవాడ, వరంగల్‌లో నేడు ప్రధాని మోదీ పర్యటన

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వేములవాడ (Vemulavada), వరంగల్‌ (Warangal)లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. సుమారు 9 గంటల సమయంలో వేములవాడకు చేరుకుంటారు. వేములవాడ రాజన్న ఆలయంలో (Rajanna Temple) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బాలానగర్‌లో బండి సంజయ్‌ (Bandi Sanjay)కు మద్దతుగా మోదీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఉదయమే సభ ఉండటంతో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.


అనంతరం ప్రధాని మోదీ వరంగల్‌కు బయలుదేరతారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ (Aruri Ramesh)కు మద్దతుగా ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మామునూర్ - తిమ్మాపూర్ రహదారి అంతా ఎస్‌పీజీ (SPG) వలయంలోకి వెళ్లిపోయింది. ఈ రాత్రి రాజ్ భవన్‌లో ప్రధాని బస చేస్తారు. గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 08 , 2024 | 07:20 AM