Home » Telangana » Karimnagar
కరీంనగర్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. వేములవాడ , వరంగల్లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు.
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వేములవాడ, వరంగల్లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయమే హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు.
ఎండలతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలతో ఇంట్లో నుంచి బయటకు రావడానికే ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో వడగళ్ల వర్షం కురిసింది.
మండలంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షం అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడి సిపోగా, మామిడి కాయలు నేలరాలాయి. ఆరుగాలం శ్రమించి పండిం చిన ధాన్యం పంట అకాల వర్షానికి నీటిపాలు కావడంతో రైతన్నలు కన్నీరుమున్నీరుగా విల పిస్తున్నారు.
మరో నాలుగు రోజుల్లో ప్రచారగడువు ముగియనుండగా అధినేతలను రప్పించి వారి సందేశాలను ప్రజలకు అందేలా చూసి విజయానికి బాటలు వేసుకోవాలని అన్ని పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీకి తెర లేవడంతో రాజకీయ పక్షాలన్నీ చివరి ప్రయత్నాలుగా అధినేతలతో సభలు ఏర్పాటు చేశాయి.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీల నుంచి జంపు జిలానీలు పెరుగుతున్నారు. దీంతో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
అవినీతి, కుంభకోణాలు వారసత్వ పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్కు ఎక్ప్సైరీ డేట్ వచ్చేసిందని బీజేపీ జాతీయప్రధాన కార్యదర్శి కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో ధాన్యం కొట్టుకుపోయింది.
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మంగళవారం నిర్వహించాల్సిన కరీంనగర్ జనజాతర సభ వర్షం కారణంగా రద్దయింది. అనంతరం అదే సభావేదికపై మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. మంగళవారం నగరంలోని భాగ్యనగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం డివిజన్ ప్రముఖులు, ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్కుమార్ మాట్లాడారు.