Share News

V.Hanumanthrao: మరోసారి మోదీ వస్తే... అదానీ, అంబానీలను కోటీశ్వరులను చేస్తారు తప్ప..

ABN , Publish Date - May 08 , 2024 | 04:48 PM

Telangana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విరుచుకుపడ్డారు. 25 లక్షల మందిని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళను పైకి తీసుకువచ్చామని మోదీ అంటున్నారని.. అదే నిజం అయితే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు..? అని ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుకోవడంలో విఫలం అవుతున్నామని చెప్పుకొచ్చారు.

V.Hanumanthrao: మరోసారి మోదీ వస్తే... అదానీ, అంబానీలను కోటీశ్వరులను చేస్తారు తప్ప..
Congress Leader V Hanumanth Rao

హైదరాబాద్, మే 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై (PM Narendra Modi) కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V.Hanumanth Rao) విరుచుకుపడ్డారు. 25 లక్షల మందిని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళను పైకి తీసుకువచ్చామని మోదీ అంటున్నారని.. అదే నిజం అయితే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు..? అని ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుకోవడంలో విఫలం అవుతున్నామని చెప్పుకొచ్చారు. మోదీ పదేళ్లలో ఏం చేశారో చెప్పడానికి ఏం లేదన్నారు. మరోసారి మోదీ వస్తే.. అదానీ అంబానీలను కోటీశ్వరులు చేస్తారు తప్ప పేదలకు ఏం చేయరని విమర్శించారు.

AP Elections: ఇద్దరి నినాదం ఒకటే.. చేతులు కలిపిన కేసీఆర్, జగన్..


రాహుల్ గాంధీ (Rahul Gandhi) కుల గణన చేపడతామని అంటున్నారని.. ఓబీసీని సపరేట్ చేసింది రాహుల్ గాంధి అని అన్నారు. దేశం సమిష్టిగా ఉండాలి అంటే కాంగ్రెస్ రావాలని అన్నారు. స్వతంత్ర్యం తెచ్చింది మహాత్మా గాంధీ అని.. బీజేపీ మీడియా పబ్లిసిటీ అసత్య ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం వేతనం రూ.400 తప్పక చేస్తామని వి.హనుమంతరావు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

AP News: విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులపై హైకోర్టు విచారణ

Stock Market: రోజంతా అనిశ్చితిలోనే .. చివరకు ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 08 , 2024 | 04:50 PM