Home » TS News
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. సోనియమ్మ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారన్నారు.
Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం నిలిచిపోయింది. మంగళవారం ఇండిగో 6ఏ 6707 విమానం హైదరాబాద్ నుంచి కొచ్చిన్కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేపైనే నిలిచిపోయింది. దాదాపు గంట నుంచి టేకాప్ కాకుండా విమానం రన్వపై నిలిచిపోయవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై నేడు సీబీఐ కోర్టులో తీర్పు వెలువడనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్ట్లో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటారు. అయినా సరే.. ఇప్పటికీ గ్రామాల్లో మూఢ నమ్మకాలు పోవడం లేదు. ఏదో ఒక మూల తమపై చేతబడి చేస్తున్నారనో.. మంత్రాలు జపిస్తున్నారనో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లిలో చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులపై దాడి జరిగింది.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్లో కుటుంబసమేతంగా సీఎం రేవంత్ ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ ఎన్నికల్లో అంతకు మించివస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తమ వందరోజుల పాలనకు రెఫరెండమని తెలిపారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా మాక్ పోలింగ్ పూర్తి అయి, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈవో వికాస్ రాజ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రజల స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వస్తున్నారన్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో భారీ సంఖ్యలో క్యూలైన్లో ఓటర్లు ఉన్నారన్నారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కొంత ఆలస్యమైందని తెలిపారు.
Telangana: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం భార్య, పెద్ద కూతురు సుష్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చిరు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉండి మరీ మెగాస్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. తమ్ముడు పవన్ కళ్యాణ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Telangana: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఓటు వేశారు. సోమవారం ఉదయం కరీంనగర్ జ్యోతినగర్లో కుటుంబ సభ్యులతో బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయవల్ల దేవుడు దయవల్ల వాతావరణం చల్లగా ఉందన్నారు. ప్రజలందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటు వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు, పార్టీల పేర్లు వంటివి ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
లోక్సభ ఎన్నికలు తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎండాకాలం కావడంతో పోలింగ్ ప్రారంభమవగానే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వచ్చి క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.