Share News

Tulasi Reddy: జగన్ ఓటమి తధ్యం

ABN , Publish Date - May 05 , 2024 | 08:31 AM

అమరావతి: జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తధ్యమని, కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయమని.. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.

Tulasi Reddy:  జగన్ ఓటమి తధ్యం
Congress, Tulasi Reddy

అమరావతి: జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) ఓటమి తధ్యమని, కాంగ్రెస్ (Congress) అధికారం లోకి రావడం ఖాయమని.. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసి రెడ్డి (Tulasi Reddy) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పులివెందుల (Pulivendula) నియోజకవర్గంలో జగన్ ఓటమి తధ్యమన్నారు. నియోజక వర్గ ప్రజలకు జగన్ దూరమయ్యారని, ఆయన పాలనలో పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.


ఇళ్ళ నిర్మాణం నత్త నడకన సాగుతోందని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తులసిరెడ్డి ఆరోపించారు. డ్రిప్ ఇరిగేషన్ మూలన పడిందని, కాంగ్రెస్ అధికారం లోకి రావడం తధ్యమని ఆయన మరోసారి అన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిలో సింహభాగం కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని తులసిరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో రెండు చోట్ల రాహుల్ బహిరంగ సభలు

స్కీం వెనుక స్కాం

8వ తేదీకి రైతు భరోసా పూర్తి

రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 08:33 AM