Share News

PM Modi: జహీరాబాద్‌లో నేడు ప్రధాని మోదీ ప్రచారం

ABN , Publish Date - Apr 30 , 2024 | 07:00 AM

మెదక్ జిల్లా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. మెదక్ జిల్లా, జహీరాబాద్‌ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌, మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.

PM  Modi: జహీరాబాద్‌లో నేడు ప్రధాని మోదీ ప్రచారం

మెదక్ జిల్లా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో (Lok Sabha Election Campaign) భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. మెదక్ జిల్లా, జహీరాబాద్‌ బీజేపీ (BJP) అభ్యర్థి బీబీ పాటిల్‌ (BB Patil), మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావు (Raghunandan Rao)కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఆందోల్‌ నియోజకవర్గంలోని అల్లాదుర్గ్‌ ఐబీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్‌-మెదక్‌ జనసభలో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు మెదక్ జిల్లా, అల్లాదుర్గం శివారులో భారీ బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. తిరిగి ప్రధాని మే 8న కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వేములవాడలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు.


అనంతరం పార్టీ కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ (Bandi Sanjay)కు మద్దతుగా వేములవాడలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) మే 1వ తేదీన (బుధవారం) హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి మాధవీలతకు (Madhavilatha) మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గౌలిపురాలో నిర్వహించే రోడ్డు షోలో అమిత్‌ షా పాల్గొంటారు. తిరిగి 5వ తేదీన నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యోగులకు అండగా..!

సంపద సృష్టితో మరింత సంక్షేమం..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 30 , 2024 | 07:03 AM