Home » LATEST NEWS
Andhrapradesh: పెన్సనర్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మే 1 నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిన్న మేడే బ్యాంకులకు సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచి బ్యాంకుల వద్దకు పెన్షనర్లు చేరుకున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం నేడు పట్టభద్రుల ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. 10 నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు.
మనుషుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కల్తీగాళ్లు చేయని పనులు ఉండవు. తమ బిజినెస్ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. ఈ మధ్య పురుగు మందులతో ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. అలాంటి పదార్థాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. కొన్నాక కల్తీ జరిగిన విషయాన్ని ఎలా కనిపెట్టాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
రోజురోజుకు ఎండలు(Heatwave) మండిపోతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పెరుగుతున్న వేడితో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడుతోంది. ఎండల కారణంగా మార్కెట్లో కూరగాయల(Vegetables) దిగుమతులు కూడా తగ్గిపోతున్నాయి.
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫి పాకిస్థాన్లో జరగాల్సి ఉంది. ఆసియా కప్ సమయంలో వేదికల గురించి ఇండియా, పాకిస్థాన్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్లో భారత్ ఆడుతుందా..? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Andhrapradesh: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. పంచాయతీ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. ఈ వర్గానికి సంపూర్ణ న్యాయం చేయని పరిపాలన సాగించారన్నారు.
రాయ్బరేలి, అమేథి స్థానాల్లో పోటీపై కాంగ్రెస్లో సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక, రాహుల్ గాంధీలు ఈ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ పరిస్థితుల్లో నేడు ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఈ రెండు స్థానాలు ఉన్నాయి.
అనేక మంది షిర్డీ సాయిబాబాను(Shirdi sai baba), శని శింగనాపూర్(Shani Singanapur) శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలని భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.
ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని హింజిలీ అసెంబ్లీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. హింజిలీ నుంచి ఆరోసారి ఎన్నిక కావడమే లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.71 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆయన ప్రకటించారు.