Share News

Graduate MLC: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల..

ABN , Publish Date - May 02 , 2024 | 11:23 AM

కేంద్ర ఎన్నికల సంఘం నేడు పట్టభద్రుల ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ నల్గొండ కలెక్టరేట్‌‌‌లో నామినేషన్లను స్వీకరించనున్నారు. 10 నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు.

Graduate MLC: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల..

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం నేడు పట్టభద్రుల ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ నల్గొండ కలెక్టరేట్‌‌‌లో నామినేషన్లను స్వీకరించనున్నారు. 10 నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. జౌన్ 5న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా.. ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Odisha Election 2024: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తులు ప్రకటన


గత ఎమ్మెల్సీ పట్టభధ్రుల ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించేసింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరుఫున తీన్మార్ మల్లన్న పోటీ చేయనున్నారు. 2021లో కూడా తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. అప్పట్లో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తుండటంతో ఆయనకు విజయావకాశాలు కొంత మేర పెరిగాయి. బీఆర్ఎస్ తరుఫున ఈ పార్టీ ఎవరిని నిలబెడుతుందో చూడాలి.

TG: కాంగ్రెస్‌ గూటికి ఇంద్రకరణ్‌రెడ్డి

Medak: బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యం కావాలి: కోదండరాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 02 , 2024 | 11:23 AM