Home » TS News
Telangana: రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరించి రాజకీయాలపైనే దృష్టి పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. తరుగు పేరుతో క్వింటాల్కు మూడు కేజీలు తీస్తున్నారని..
ఉన్నత స్థానంలో ఉండి.. మహిళల పట్ల గౌరవంతో నడుచుకోవాల్సిన ఆఫీసరే లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాజాగా కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఎవరా ఆఫీసర్ అంటారా? కామారెడ్డి డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు, వేధింపుల ఘటనపై డీఎంహెవ్ పై ఉన్నతాధికారులు ఫైర్ అయ్యారు.
Telangana: సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి ఆహ్లాదం.. ఆనందాన్ని ఇస్తుంది. ప్రతీరోజు ఎంతో కష్టపడుతూ ఉండే మనిషికి సినిమా కొంత రిలీఫ్ను ఇస్తుందని చెప్పువచ్చు. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది సినిమాలకు వెళుతుంటారు. మరి కొంతమంది తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్లకు పడుతుంటారు. అయితే ఇటీవల తెలంగాణలో లోక్సభ ఎన్నికల కారణంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాని పరిస్థితి. దీంతో థియేటర్లు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఊహించని షాక్ ఇచ్చింది.
Telangana: జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడంతో తన జన్మదన్యమైందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. సోనియమ్మ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారన్నారు.
Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం నిలిచిపోయింది. మంగళవారం ఇండిగో 6ఏ 6707 విమానం హైదరాబాద్ నుంచి కొచ్చిన్కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేపైనే నిలిచిపోయింది. దాదాపు గంట నుంచి టేకాప్ కాకుండా విమానం రన్వపై నిలిచిపోయవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై నేడు సీబీఐ కోర్టులో తీర్పు వెలువడనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్ట్లో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటారు. అయినా సరే.. ఇప్పటికీ గ్రామాల్లో మూఢ నమ్మకాలు పోవడం లేదు. ఏదో ఒక మూల తమపై చేతబడి చేస్తున్నారనో.. మంత్రాలు జపిస్తున్నారనో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లిలో చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులపై దాడి జరిగింది.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్లో కుటుంబసమేతంగా సీఎం రేవంత్ ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ ఎన్నికల్లో అంతకు మించివస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తమ వందరోజుల పాలనకు రెఫరెండమని తెలిపారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా మాక్ పోలింగ్ పూర్తి అయి, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈవో వికాస్ రాజ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రజల స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వస్తున్నారన్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో భారీ సంఖ్యలో క్యూలైన్లో ఓటర్లు ఉన్నారన్నారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కొంత ఆలస్యమైందని తెలిపారు.