Share News

AP Elections: రాజధాని నిర్మాణం చేసుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం: పురందేశ్వరి

ABN , Publish Date - May 02 , 2024 | 10:30 AM

Andhrapradesh: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. పంచాయతీ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. ఈ వర్గానికి సంపూర్ణ న్యాయం చేయని పరిపాలన సాగించారన్నారు.

AP Elections: రాజధాని నిర్మాణం చేసుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం: పురందేశ్వరి
Rajahmundry MP alliance candidate Purandeshwari Election Campaign

ఏలూరు, మే 2: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి (Rajahmundry MP alliance candidate Purandeshwari), గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఎన్నికల ప్రచారంలో (Election Campaign) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. పంచాయతీ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. ఈ వర్గానికి సంపూర్ణ న్యాయం చేయని పరిపాలన సాగించారన్నారు.

AP Elections: తిరగబడుతున్న ఓటర్లు.. ఆ నేతల్లో టెన్షన్..


అభివృద్ధి చెందాలంటే అందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గడచిన ఐదు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామన్నారు. రైతుకు ఏ మాత్రం ఉపయోగం లేని ప్రభుత్వాన్ని చూశామని వ్యాఖ్యలు చేశారు. కూటమిలో మూడు పార్టీలు పేదవారికి న్యాయం చేయాలని సంకల్పంతో పని చేస్తున్నామని రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి పురందేశ్వరి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

BRS MLAs : ప్రచారంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనాసక్తి?

TDP: టీడీపీ వర్గీయులపై కత్తులతో దాడి చేసిన వైసీపీ వర్గీయులు

Read latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 10:35 AM